calender_icon.png 6 June, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారు

04-06-2025 02:24:42 PM

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు( Monsoon session) జూలై 21 నుండి ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు(Union Minister for Parliamentary Affairs Kiren Rijiju) బుధవారం ప్రకటించారు. మూడు నెలలకు పైగా విరామం తర్వాత పార్లమెంటు ఉభయ సభలు జూలై 21న ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్న పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తేదీలను సిఫార్సు చేసిందని రిజిజు విలేకరులకు తెలిపారు. ఈ ఏడాది జనవరి 31న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

2025లో మొదటి పార్లమెంట్ సమావేశాన్ని ముగించి లోక్‌సభ, రాజ్యసభ రెండూ ఏప్రిల్ 4న నిరవధికంగా వాయిదా పడ్డాయి. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం దాడి చేసిన సైనిక విన్యాసాలైన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) గురించి చర్చించడానికి ప్రతిపక్ష నాయకులు ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని త్వరగా నిర్వహించాలని ఒత్తిడి చేస్తున్న తరుణంలో వర్షాకాల సమావేశాల తేదీ ప్రకటన వచ్చింది. ఆపరేషన్ సిందూర్‌పై ప్రత్యేక సమావేశాల్లో చర్చించాలని నిన్న ప్రధాని నరేంద్ర మోదీకి(Prime Minister Narendra Modi) ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా 16 పార్టీల ఎంపీలు లేఖ రాశాయి.

ప్రత్యేక సమావేశాల డిమాండ్ పెరుగుతుండగా.. ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్‌లోని పహల్గామ్ దాడిలో 26 మంది పౌరులు ఉగ్రవాదుల చేతిలో మరణించిన తర్వాత జరుగుతున్న మొదటి పార్లమెంటు సమావేశం ఇది. పహల్గామ్ దాడి(Pahalgam attack), ఆపరేషన్ సిందూర్ ఈ సమావేశంలో చర్చనీయాంశాలుగా ఉంటాయని భావిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని కూడా వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ అంశంపై రాజకీయ ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు ప్రభుత్వం మంగళవారం ప్రతిపక్ష పార్టీలను సంప్రదించింది.