07-10-2025 12:00:00 AM
ప్రజల సమస్యల పరిష్కారానికై సీపీ సాయి చైతన్య ఆదేశాలు
నిజామాబాద్, అక్టోబర్ 6 (విజయ క్రాంతి) : నిజామాబాదు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య చేపట్టిన పోలీస్ ప్రజావాణి సత్ఫలితాలను ఇస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా బాధితులు తమ సమస్యలను నేరుగా జిల్లా పోలీస్ కమిషనర్ను కలిసి విన్నవించుకునే అవకాశం పోలీస్ ప్రజావాణి కల్పిస్తోంది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు సిపి సాయి చైతన్య పలు సూచనలు చేస్తూ సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారి చేస్తున్నారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల యొక్క ఎస్.ఐ సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని పరిష్కారానికి సూచనలు సిపి చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నాము అని ఆయన తెలిపారు .