31 March, 2026 | 2:21 AM

ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలి

31-03-2026 12:44 AM

మహబూబాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులకు అధికారులు తక్షణ పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయా జిల్లా కలెక్టర్లు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను సావధానంగా విని, వారి సమస్యకు పరిష్కారం చూ పేందుకు సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తమ పరిధిలో సమస్యకు పరిష్కారం లభించకపోతే వెంటనే ఉన్నతాధికారులకు ఆ విషయాన్ని తెలియజేసి పరిష్కార దిశగా కృషి చేయాలని సూచించారు.