calender_icon.png 13 May, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణికి 75 ఫిర్యాదులు

13-05-2025 12:09:26 AM

గద్వాల, మే 12 ( విజయక్రాంతి ) : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధి కారులకు సూచించారు. సమీకృత జిల్లా కా ర్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావా ణి కార్యక్రమానికి వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజల నుండి 75 ఫిర్యాదులు అందా యి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవిస్తూ అర్జీలను సమర్పించారు. వచ్చిన అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.