21-06-2025 11:34:25 PM
ఎంఈవో సత్యనారాయణ...
తూప్రాన్ (విజయక్రాంతి): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్దిస్తుందని ప్రతి ఒక్కరు యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని తూప్రాన్ ఎంఈవో సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) పురస్కరించుకొని శనివారం ఎంపియుపిఎస్ రావెల్లిలో విద్యార్థులతో కలసి యోగాసనాలు వేశారు. ఈ సందర్బంగా ఎంఈఓ మాట్లాడుతూ... శారీరక వ్యాయామం వల్ల విద్యార్థులు శారీరకంగా మానసికంగా ఎంతో అభివృద్ధి చెందుతారన్నారు. విద్యార్థులకు యోగసనాలతో జ్ఞాపక శక్తి పెరిగి చదువులో ముందంజ వేస్తారని తెలిపారు. ఎంఈఓ సత్యనారాయణ ఉదయం 6 గంటల 30 నిమిషాల ప్రాంతంలో పాఠశాలకు చేరుకొని పలు ఆసనాలు తాను చేస్తూ విద్యార్థులకు మార్గ నిర్దేశం చేశారు.