30-05-2025 01:01:13 AM
కొండాపూర్ మే 29 : భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపు మేరకు జై బాపు , జై భీమ్, జై సంవిధాన్, ప్రచారం గురువారం సైదాపూర్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పాటనికి పూలమాల వేసి ర్యాలీ తీశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వంశీ ధర్ గౌడ్ , ప్రవీణ్ కుమార్ లు మాట్లాడుతూ ఈ ప్రచారం జవనరి 26న అంబేడ్కర్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్లోని మోవ్లో భారీ ర్యాలీతో ముగుస్తుందని తెలిపారు. అంబేడ్క్ప చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు గాను హోం మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలనే డిమాండ్ను పునరుద్ఘాటిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.