25-12-2025 04:09:35 PM
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం సీనియర్ జర్నలిస్ట్ బాలకృష్ణ సతీమణి సరిత ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందుతుంది. విషయం తెలుసున్న జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా అనారోగ్యానికి కలిగిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని సూచించి ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు దిగజర్ల శ్రీనివాస్, బీ ఆర్ ఎస్ నాయకులు గంట్ల శ్రీనివాస్ రెడ్డి, కురవి మధు తదితరులు పాల్గొన్నారు.