14 July, 2026 | 7:01 PM

Breaking News

పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •  

గుంజపడుగు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విజ్ఞాన విహార యాత్ర

25-12-2025 04:07 PM

మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని గుంజపడుగు ప్రభుత్వ పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం బుధవారం హైదరాబాద్ లోని చారిత్రక ప్రాంతాలు గోల్కొండ కోట, చార్మినార్, బిర్లా సైన్స్ మ్యూజియం, నెహ్రూ జూ పార్క్ మొదలైనవి విజ్ఞాన విహార యాత్రలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా గోల్కొండ, చార్మినార్ లకు సంబంధిత చరిత్ర ప్రభావాలను తెలుసుకుని అబ్బుర పడ్డారు. జూపార్క్ లోని జంతువులకు, పక్షులను సందర్శించి వాటి జీవన విధానాలను తెలుసుకున్నారు.

బిర్లా సైన్స్ మ్యూజియం లోని సైన్స్ ఎగ్జిబిట్లను, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ సూత్రాలను తెలుసుకున్నారు. బిర్లా సైన్స్ మ్యూజియం లో డైరోసార్ నిజ అస్థిపంజరం, వృక్ష శిలాజాలను సందర్శించి సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యారు. ఇలాంటి విజ్ఞాన విహార యాత్రల ద్వారా విద్యార్థులకు వినోదం తో పాటు విజ్ఞానం చేకూరుతుందని ఉపాధ్యాయులు అన్నారు. ఆనందంగా అభ్యసించడం ద్వారా నేర్చుకున్న విషయాలు జీవితాంతం గుర్తుంటాయని, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, మంథని మండల విద్యాధికారి దాసరి లక్ష్మి  తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాసం శివలీల, కర్రు సురేష్, కాసిపేట భూమయ్య, వడ్లకొండ స్వామి, రవీందర్,దాసరి నరేందర్, మూడెత్తుల సమ్మయ్య, సుప్రజ లు పాల్గొన్నారు.