09-05-2025 12:28:36 AM
సంబురాలు, క్షీరాభిషేకాలు
మంచిర్యాల, మే 8 (విజయక్రాంతి) : పహల్గాంలో భారతీయులపై ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతి స్పందనగా ప్రధాన మంత్రి నాయకత్వంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్తో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాదుల స్థావరాల పై దాడి చేసి ఉగ్రవాదులను మట్టికరిపించిన భారత సైన్యానికి ప్రత్యేక అభినందనలు బిజెపి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు.
గురువారం బెల్లంపల్లి చౌరస్తాలో పీఎం మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి, త్రివిధ దళాల సైనికులకు పూలాభిషేకం చేశారు. అనంతరం బిజెపి సీనియర్ నాయకులు రఘునాథ్ వెరబెల్లితో కలిసి ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అమిరిశెట్టి రాజ్ కుమార్, పట్టి వెంకట కృష్ణ, దుర్గం అశోక్, గాజుల ముఖేష్ గౌడ్, ఆకుల అశోక్ వర్ధన్, ఎనగందుల కృష్ణ మూర్తి, బియ్యాల సతీష్ రావు, మోటపలుకుల తిరుపతి, తుల ఆంజనేయులు, గడ్డం స్వామి రెడ్డి, సత్రం రమేష్, కర్రె లచ్చన్న, మిట్టపల్లి మొగిలి, జోగుల శ్రీదేవి, మోతె సుజాత, నాగుల రాజన్న, బింగి ప్రవీణ్, కొండవీటి తిరుమల, పబ్బతినేని కమలాకర్ రావు, సుధాకర్ రావు, పల్లి రాకేష్, రాకేష్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో..
మంచిర్యాల, మే 8 (విజయక్రాంతి): ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసిన భారత ఆర్మీకి అభినందనలు అని మంచిర్యా ల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. గురువారం భారత ఆర్మీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు.
పహల్గాం దాడికి ప్రతికార చర్యలలో ఆపరేషన్ సింధూ ర్లో పాల్గొన్న త్రివిధ దళాలకి బీఆర్ఎస్ పార్టీ, జిల్లా ప్రజల తరఫున అభినందనలు తెలుపుతున్నామన్నారు. అనంత రం పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.