24-04-2025 01:26:33 AM
కరీంనగర్, ఏప్రిల్23(విజయక్రాంతి): ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాంధించిన కరీంనగర్ నగరంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒకేషనల్ జూనియర్ కాలేజీ కి చెందిన విద్యార్థులు వారి అధ్యాపక బృందం తో బుధవారం రోజున కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల ను వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్బంగా అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థుల ను ఎమ్మెల్యే గంగుల అభినంధించారు.
రేఖాంజలి సీనియర్ ఇంటర్ ఎంపీ హెచ్ డబ్ల్యు విభాగంలో 949 మార్కులు పద్మ 924 మౌనిక 911 మార్కులను సాధించారు. అదేవిధంగా మొదటి సంవత్సరం ఎం ఎల్ టి విభాగంలో పౌర్ణమి 451 మార్కులు వెన్నెల 435 ఎం పి హెచ్ డబ్ల్యు లో ఫలితాలను సాధించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత చదువులు చదివి, ఉన్నతస్థాయిలో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు , కళాశాల కరస్పాండెంట్ వై చంద్రశేఖర్, అధ్యాపకులు అశోక్, సహన స్వాతి, సింధు, జ్యోతి రోహిణి, విద్యార్థినిలు పాల్గొన్నారు.