calender_icon.png 25 June, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి

24-06-2025 06:52:14 PM

జైపాల్ రెడ్డి..

మునగాల: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి(Mandal Congress Party President Koppula Jaipal Reddy) అన్నారు. మంగళవారం మండల కేంద్రములో రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందించడంతో రైతులు సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), రాష్ట్ర ఇరిగేషన్ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy), కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి చిత్రపటాలకి క్షీరాభిషేకం నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని రైతులందరికీ సాగు యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా అందించడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతు భరోసా సంబరాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పేద ప్రజల పక్షపాతి అని రాష్ట్ర ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లపాటి శ్రీనివాసరావు, కోదాడ మార్కెట్ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బచ్చు అశోక్, కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు మాతంగి బసవయ్య, మండల అధ్యక్షుడు నర్రా శీపాల్ రెడ్డి, ఉప్పుల జానకి రెడ్డి, కాసర్ల శ్రీనివాస్, కొమ్ము ఈదారావు శెట్టి గిరి, గోపి, కాసర్ల వెంకట్, నాగేశ్వరరావు, సోమపంగు గోపి, మళోత్ మహేష్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.