calender_icon.png 25 June, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదులు దరఖాస్తు చేసుకోవాలి

24-06-2025 06:55:26 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యాయవాదులకు స్టైఫండ్ ఇతర సౌకర్యాల కోసం అర్హులైన న్యాయవాదులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి శ్రీనివాస్(District Officer Srinivas) తెలిపారు. 2025-26 సంవత్సరానికి గాను నలుగురు న్యాయవాదులకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా నెలకు రూ.1000 చొప్పున టైఫాయిడ్ 385 ఎంట్రీ ఫీజు ఫర్నిచర్ కోసం మూడు వేల ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని వివరించారు. బీసీ కులాలకు చెందిన న్యాయవాద పట్టా పొందిన వారు ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని వారిలో ఉత్తమ వారిని ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. న్యాయవాదుల వయస్సు 30 నుంచి 39 సంవత్సరాలలోపు ఉండాలని ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.