calender_icon.png 17 June, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదవాళ్ల సొంత ఇంటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

16-06-2025 11:18:10 PM

ఇందిరమ్మ ఇళ్ళను పర్యవేక్షించిన ప్రణవ్..

హుజురాబాద్ (విజయక్రాంతి): పేదింటి సొంత ఇంటి కల నెరవేరుస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు(Congress Party Constituency Incharge Vodithala Pranav Babu) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని ధర్మరాజు పల్లె, పెద్ద పాపయ్యపల్లి గ్రామాలలో ప్రభుత్వం మంజూరు చేసిన, నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ళను సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందన్నారు.

పదేళ్ల నుండి గుడిసెలో నివసిస్తూ సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న పెద్ద పాపయ్య పల్లి గ్రామంలోని 27 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పైలట్  ప్రాజెక్టుగా తీసుకొని గ్రామానికి 98 ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేసి రెండో విడత డబ్బులు కూడా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిందని అన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలలో ఒక ఇల్లు కూడా ఇవ్వనివారు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం  ప్రవేశపెట్టిన ఏ పథకమైన నేరుగా ప్రజలకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.