మేం చేసిన రైతు పంటల రుణమాఫీ దేశంలోనే రికార్డు
హైదరాబాద్: వరంగల్ సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చి హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేస్తున్నమని ముఖ్యమంత్రి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతుల పంటల రుణమాఫీ నిధుల కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మట్లాడుతూ... రెండో విడతలో రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేశామన్నారు.
ఇవాళ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల ఇళ్లలో పండుగ రోజుగా మరడంతో మా జన్మ ధన్మమైందని సీఎం తెలిపారు. రాజకీయ ప్రయోజనం కాదు.. రైతు ప్రయోజనాలే మా ప్రభుత్వ విధానమని వచ్చిన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. కార్పొరేట్ సంస్థల అధిపతులు బ్యాంకులను మోసం చేసి ఈ పదేళ్లలో రూ.14 లక్షల కోట్లు ఎగవేశారని సీఎం వెల్లడించారు. రైతులు మాత్రం బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి సాగు చేస్తున్నారని, అనేక మంది రైతులు సొంత పొలంలోనే పురుగుల మందు తాగి చనిపోయారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏ రైతు కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడదనేది మా విధానమన్నారు. గత ప్రభుత్వం చేసిన రూ.లక్ష రుణమాఫీ వడ్డీ కట్టేందుకే సరిపోయిందని, వాణిజ్య, వ్యవసాయ బ్యాంకుల నుంచి కూడా వివరాలు సేకరించామని సీం పేర్కొన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం రుణమాఫీ చేయలేదని కొంతమంది విమర్శంచారు. ఎలాంటి పరిస్థతులు ఎదురైనా రుణమాఫీ చేసి తీరాలని చెప్పామన్నారు. రైతు రుణమాఫీ మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనామని, దేశ భద్రత, ఆహార భద్రతకు మా పార్టీ ప్రాముఖ్యత ఇచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు.
రైతుల కష్టాలను గుర్తించే నెహ్రూ ఆనాడు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీదే ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నది మాపార్టీ అని, ఆరు గ్యారంటీల అమలుకు మంత్రులందరూ నాకు అండగా నిలబడ్డారన్నారు. వచ్చే నెలలో రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని, మేం చేసిన రైతు పంటల రుణమాఫీ దేశంలోనే రికార్డు అని ఆయన తెలిపారు. గతంలో ఏ రాష్ట్రం కూడా రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేయలేదని, రైతులకు అండగా ఉంటామనే విశ్వాసం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.




