30-07-2024 03:33:16 PM
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్ గా జిస్టిస్ మదన్ భీమ్ రావు లోకూర్ నియమితులయ్యారు. జస్టిస్ లోకూర్ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు సీజేగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పని చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కమిషన్ కొత్త ఛైర్మన్ ను నియమించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో యాదాద్రి, భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ ను కోనుగోలు చేసింది.
అయితే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను విచారణ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఎల్. నరసింహరెడ్డిని కమిషన్ ఛైర్మన్ గా నియమించింది. విచారణ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ సైతం కొట్టుయాలని, ఛైర్మన్ నిష్పాక్షికతను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు కమిషన్ ఛైర్మన్ ను మార్చాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మసనం ఆదేశించింది. దీంతో జస్టిస్ ఎల్. నరసింహ రెడ్డి తన రాజీనామా లేఖను న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టు సమర్పించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త ఛైర్మన్ ను నియమిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కొత్త ఛైర్మన్ గా జిస్టిస్ మదన్ భీమ్ రావు లోకూర్ ని నియమించింది.