20 March, 2026 | 8:42 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

రైతులకు రెండోవిడత రుణమాఫీ చేయడం సంతోషంగా ఉంది

30-07-2024 01:37 PM

హైదరాబాద్: రైతులకు రెండోవిడత రుణమాఫీ చేయడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మా ప్రభుత్వం రైతుల మేలు కోసం ఎన్నో చర్యలు చేపట్టిందని, అందుకోసం ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాం.. ఇచ్చిన మాట ప్రకారం రైతు పంటల రుణమాఫీపై శరవేగంగా నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి భట్టి పేర్కొన్నారు.

రెండో విడతలో రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర ఉన్న 6.4 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,190 కోట్లు జమ అవుతున్నాయి. ఎన్నికల ముందు వరంగల్ సభలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చినప్పుడు అదరూ అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిజం చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ఎస్ లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు విడతలుగా చేసి చివరి విడత సగం వదిలేసిందన్నారు. 2 లక్షల రుణమాఫీ సాధ్యం కాదనుకున్నవాళ్లకి మేం రుణమాఫీ చేసి చూపిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.