calender_icon.png 31 May, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలను గాలికొదిలిన కాంగ్రెస్

11-05-2025 01:54:59 AM

  1. మోదీ హయాంలోనే బీసీల సంక్షేమం
  2. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కే లక్ష్మణ్

హైదరాబాద్, మే 10(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సుదీర ్ఘకాలం పాలించినప్పటికీ బీసీలకు తీవ్ర అన్యా యం చేసిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మ ణ్ విమర్శించారు. తమ పాలనలో కనీ సం కులగణనను కూడా నిర్వహించలేకపోయిందని ధ్వజమెత్తారు. బ్యాక్వర్డ్ క్లాసె స్ సెంటర్ ఫర్ ఎంపవర్‌మెంట్ (బీసీసీఈ) ఆధ్వర్యంలో కుల గణన, ఓబీసీల భవిష్యత్తు నిర్ణయం, సామాజిక న్యాయం అనే అంశాలపై బీసీసీఈ డైరెక్టర్, బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి వీరేందర్‌గౌడ్ అధ్యక్షతన శనివారం సోమాజిగూడలోని కత్రియ హోటల్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశంలో బీసీ లు అత్యధిక సంఖ్యలో ఉన్నారని, కానీ వారి సంక్షేమాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. మెజారిటీ ప్రజల కు తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే బీసీలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. గతం లో ఎన్నడూ ఊహించని విధంగా జనగణనతోపాటు కులగణన కూడా చేస్తున్నారని, ఫలితంగా మెజారిటీ ప్రజలైన బీసీలకు ఇప్పుడు సరైన న్యాయం జరుగుతుందని వెల్లడించారు. 

యూపీలో బీసీలకు సరైన న్యాయం: ఆ రాష్ట్ర మంత్రి నరేంద్ర కశ్యప్

ఉత్తరప్రదేశ్‌లో బీసీల సంక్షేమానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పాటుబడుతోందని, యూపీ బీసీ సంక్షేమశాఖ సహాయ మంత్రి నరేంద్ర కశ్యప్ వెల్ల డించారు. కేంద్రంలో, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నందుకే బీసీలు అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు. బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా రాణించి సమాజాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. దశాబ్దాలుగా కులగణన జరగాలని పోరాటం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఏనాడూ స్పందించలేదని పేర్కొన్నారు.

కులగణన చేయాలని మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ కీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి బీసీ కాబట్టే మోదీ బీసీల గొంతుకను గౌరవించి కులగణన చేపడుతున్నారని చెప్పారు. కులగణనకు అందరూ మద్దతు తెలుపాలని, ఈ అంశంపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని కోరారు.

కార్యక్రమంలో మధ్యప్రదేశ్ రాష్ర్ట పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి, రాష్ర్ట బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, బీసీ మేధావులు నారగౌనిగౌడ్ , సీఎల్‌ఎన్ గాంధీ, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, వివిధ రంగాలలో నిష్ణాతులు, రాజ్యాంగ నిపుణు లు, విద్యావేత్తలు, సామాజిక వేత్తలు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నా రు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు ఉగ్రదాడిలో అమరులైనవారికి నివాళి అర్పిస్తూ మౌనం పాటించారు.