22 June, 2026 | 7:44 PM

Breaking News

విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •   గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: టిపిటిఎఫ్   •   వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి   •   పెన్షనర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం అలసత్వం విడాలి   •   అనురాగ్ లో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిపై డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్   •   డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన   •   దమ్మపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్   •   శభాష్... సర్పంచ్ సాబ్   •  

కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది

17-02-2026 02:02 AM

నా ఎక్స్ అఫీషియో ఓటు హక్కును కాలరాస్తున్నది

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తున్నదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన తనకు వరంగల్‌లోని 12 నియోజకవర్గాల్లో ఎక్కడైనా మున్సిపల్ చైర్మన్ కోసం ఎక్స్ అఫిషియో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

కానీ ఈ రాజ్యాంగబద్ధమైన హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కి తనను నామినేటెడ్ ఎమ్మెల్సీ/ఎంపీగా గుర్తిస్తూ ఓటు వేసే హక్కును కాలరాస్తూ.. ఓటు వేయడాన్ని కలెక్టర్ నిరాకరించడాన్ని తీవ్రంగా ఖండించారు. లోకల్ బాడీ ఎమ్మెల్సీగా లోకల్ కౌన్సిలర్లు ఓటు వేస్తేనే గెలిచిన తనకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్‌అఫిషియో ఓటు వేసే హక్కు ఉం టుందని స్పష్టం చేశారు. ఆ హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాయడం ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.