08-01-2026 01:47:39 AM
తూప్రాన్, జనవరి 7: మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పోతరాజు ధనరాజ్ కాంగ్రెస్ పార్టీని వీడి బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లేకపోవడంతోనే పార్టీ మారినట్లు ధనరాజ్ వెల్లడించారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఇన్చార్జి వంటేరు ప్రతాపరెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ధనరాజ్ తో పాటు మరి కొంతమంది నాయకులు బీఆర్ఎస్ కండువా కప్పుకొని పార్టీ మారారు.