15 March, 2026 | 6:07 PM

Breaking News

మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •  

ఇందిరా నగర్ జాతర పోస్టర్ల ఆవిష్కరణ

15-03-2026 03:42 PM

బెజ్జూర్,(విజయక్రాంతి):  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని ఇందిరా నగర్ జాతర ఏప్రిల్ 3న నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు దేవర వినోద్ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా బెజ్జూర్ మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి దేవస్థాన ప్రాంగణంలో బెజ్జూర్ శ్రీ రంగనాయక స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు తంగేడి పల్లి మహేష్, గ్రామ ప్రజలతో కలిసి ఇందిరానగర్ మహా జాతర పోస్టర్లను ఆవిష్కరించారు. ఏప్రిల్ 3న జరిగే జాతర ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.