చింతగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసిన కాంగ్రెస్ నాయకులు
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District)లోని కన్నాయిగూడెం మండలంలోని చింతగూడెం గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోయడం జరిగింది. ఈ కార్యక్రమాని ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి అప్సర్ పాషా(Congress Party Mandal President MD Afsar Pasha) పాల్గొని మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనల మేరకు ముగ్గు పోశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కో-ఆర్డినేటర్ దుర్గం ప్రభాకర్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సునార్కని రాంబాబు సునార్కని సాంబశివ జంగ కృష్ణ వంగల సుమన్ గ్రామ కమిటీ అధ్యక్షులు నవీన్ ముడిగ రమేష్ సదన్ రావు దుర్గం రామ్మూర్తి నరేష్ రవీందర్ సాంబయ్య కావేరి లక్ష్మి ముడిగ రాజేశ్వరి ఆలయ వనిత గోస్కుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.






