29-06-2025 08:24:53 PM
ఏటూరునాగారం (విజయక్రాంతి): తెలంగాణ పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క(Minister Seethakka) ఆదేశాల మేరకు ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు ఆధ్వర్యంలో భూటారం గ్రామంలో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు మాట్లాడుతూ... భూటారం గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్నారు. మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి కృషి చేపడుతామన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లోకి కార్యకర్తలు తీసుకెళ్లాలి, రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయాన్ని సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ఖలీల్ ఖాన్, జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్, జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య, జిల్లా యూత్ కార్యదర్శి ఎండీ గౌస్ పాషా, స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.