13-06-2025 01:27:41 AM
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, జూన్ 12 : మహిళల ఆరోగ్యానికి ప్రత్యేకంగా థీమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సచివాలయ నగర్ దగ్గర నిర్మిస్తున్న ఉమెన్ థీమ్ పార్కులో జరుగుతున్న పను లను గురువారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళల ఆరోగ్యం కోసమే ప్రత్యేకంగా ఉమెన్ థీమ్ పార్కు ఏర్పాటు చేసిందన్నారు.
థీమ్ పార్కు అభివృద్ధి పనులకు దాదాపు కొన్ని లక్షల రూపాయల నిధులు మంజూరు చేశానన్నారు. త్వరగా పార్కు అభివృద్ధి పనులను పూర్తిచేసి మహిళలకు అందుబాటులోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు రమేశ్ బాబు, దామోదర్, బీఆర్ఎస్ నాయకులు మధుసాగర్, గండికోట శ్రీనాధ్ తదితరులుపాల్గొన్నారు