calender_icon.png 13 June, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రుల మార్పు

13-06-2025 01:30:44 AM

  1. ఈసారి కొత్త మంత్రులకూ చోటు
  2. అడ్లూరికి నల్లగొండ, వాకిటికి ఖమ్మం..
  3. గడ్డం వివేక్‌కు మెదక్ జిల్లా బాధ్యతలు 

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): రాష్ట్రపరిధిలోని ఉమ్మడి పది జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను మారుస్తూ, కొత్త మంత్రులకు చోటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు గురువారం రాత్రి ప్రభుత్వ సీఎస్ రామకృష్ణారావు ఉత్వర్వులు జారీ చేశారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా దామోదర రాజనర్సింహ, రంగారెడ్డికి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వరంగల్‌కు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్‌కు పొన్నం ప్రభాకర్, నిజామాబాద్‌కు సీతక్క, కరీంనగర్‌కు తుమ్మల నాగేశ్వరరావు, ఆదిలాబాద్‌కు జూపల్లి కృష్ణారావు, మెదక్ వివేక్ వెంకటస్వామి, నల్లగొండకు అడ్లూరి లక్ష్మణ్‌కు మార్, ఖమ్మానికి వాకిటి శ్రీహరి నియమితులయ్యారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వరంగల్, హైదరాబాద్ జిల్లాలకు గతంలో ఉన్న ఇన్‌ఛార్జ్ మంత్రులే కొనసాగుతుండగా, మిగతా ఆరు జిల్లాలకు మాత్రం మంత్రుల మార్పు జరిగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో నిజామాబాద్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించగా, ఈసారి ఆదిలాబాద్, మంత్రి సీతక్క గతంలో ఆదిలాబాద్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించగా, ఈసారి నిజామాబాద్ కు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించనున్నారు.

అలా గే ఇప్పటివరకు కరీంనగర్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తప్పించి, సర్కార్ బాధ్యతలను తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగించింది. ఇప్పటివరకు మెదక్ ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న కొండా సురేఖను తప్పించి, ఆ బాధ్యతలను వివేక్‌కు, ఖమ్మం ఇన్‌చార్జ్ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని తప్పించి వాకిటి శ్రీహరిని నియమించింది.

అలాగే నల్లగొండ ఇన్‌ఛార్జ్ మంత్రిగా గతంలో తుమ్మల వ్యవహరించేవారు. ఇప్పు డా ఆయన కరీంనగర్ ఇన్‌ఛార్జ్ మంత్రిగా నియమితులు కావడంతో ఆ బాధ్యతలు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తీసుకోనున్నారు.