ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
11-11-2025 01:20 AM
రేగోడు, నవంబర్10 :ఇల్లు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తుందని పీసీసీ సభ్యుడు మున్నూరి కిషన్ తెలిపారు. మండల కేంద్రమైన రేగోడ్ గ్రామంలో పుట్టి లక్ష్మి ఇందిరమ్మ ఇల్లును సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమములో తహసీల్దార్ దత్తారెడ్డి, ఎంపీడీఓ సీతారామమ్మ, పంచాయతీ కార్యదర్శి అరుణ్కుమార్, మాజీ జడ్పీటీసీ రాజేంద్రపాటిల్, పిఏసిఎస్ చైర్మన్లు శ్యాంరావు, రాధాకిషన్ గుప్తా, మాజీ కో ఆ ప్షన్ చోటు మియా, మాజీ సర్పంచ్ సునీత నారాయణ, మార్కెట్ కమిటీ సభ్యులు శ్రీధర్ గుప్తా, ఫాజిల్, గున్నసంగమేశ్వర్, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు నాలాచెరు రాధాకిషన్, యాద య్య, హేమలత, బుజ్జమ్మ, డీలర్ ప్రభాకర్, కారోబార్ దత్తు, అంజిరెడ్డి, పాల్గొన్నారు.




