29-09-2025 02:39:48 PM
బోయినపల్లి,(విజయక్రాంతి): చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు మండల కాంగ్రెస్ నాయకులు శంషాబాద్ ఎయిర్ ఫోర్టులో ఘన స్వాగతం పలికారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆస్ట్రేలియాలోని బ్రీ స్బేన్ నగరంలో జరిగిన బతుకమ్మ వేడుకలను ముగించుకొని వస్తున్న సందర్భంగా సోమవారం శంషాబాద్ ఎయిర్ ఫోర్టు లో ఆయనకు ఘన స్వాగతం పలికి పుష్ప గుచ్ఛం అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ బీసీ సంఘం నాయకులు కూస రవీందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు సంబ లక్ష్మీరాజం, ఏనుగుల కనకయ్య, తదితరులున్నారు.