calender_icon.png 10 October, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను దర్శించుకున్న కాంగ్రెస్ మైనార్టీ నాయకులు గౌస్

10-10-2025 12:30:25 AM

బాన్సువాడ, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : రాజస్థాన్ లోని అజ్మీర్ షరీఫ్ దర్గానీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 13 వ వార్డు కాంగ్రెస్ యువ నాయకులు మహమ్మద్ గౌస్ గురువారం దర్శించుకుని సూఫీ సర్మత్ సుల్తాన్ ఉల్ హింద్ ఖాజా గరీబన్నవాజ్ దర్గాలో దువా చేయడం జరిగింది.

బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు ఆయుఆరోగ్యాలతో ఉండాలని ప్రజలకు మంచి చేసేలా అల్లా చల్లగా చూడాలని ఆయన మొక్కినట్లు తెలిపారు.

ఏ విధంగా బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆశీర్వాదం బాన్సువాడ ప్రజల పైన ఉండాలని కోరుకువడం జరిగింది. ఆయన వెంట మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.