8 April, 2026 | 5:06 PM

కాంగ్రెస్ పార్టీ 52 వ డివిజన్ కార్యాలయం ప్రారంభం.

08-04-2026 03:06 PM

హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని 52వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు విష్ణు రెడ్డి ప్రారంభించారు. అనంతరం డివిజన్ నాయకులు పెద్ద బోయిన గణేష్ యాదవ్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గణేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో

కాంగ్రెస్ పార్టీ నాయకులు బంక సంపత్ యాదవ్, నాయిని లక్ష్మారెడ్డి,కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకులు సుగుణాకర్ రెడ్డి, డివిజన్ నాయకులు లావుడియా బాలు నాయక్, దొడ్డుపాటి రవి, తొడే దేవేందర్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు మోహన్ నాయక్, సాయి సోషల్ మీడియా 52 డివిజన్ ఇంచార్జ్ రాము, వినయ్, శ్రావణ్, లతో పాటు 52వ డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.