calender_icon.png 25 June, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు రామగిరి లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం

25-06-2025 12:11:11 PM

హాజరు కానున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు 

మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్ 

మంథని,(విజయక్రాంతి): రేపు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం. రామగిరి మండలం(Ramagiri Mandal) పన్నురు లోని శ్రీ సత్య AC ఫంక్షన్ హాల్ లో  మధ్యాహ్నం 3:00 గంటలకు నిర్వహిస్తున్నట్లు మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. మంథని బ్లాక్ పరిధిలోని మంథని మున్సిపల్, మంథని, రామగిరి, ముత్తారం, కమాన్ పూర్  మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు,  నామినేటెడ్ పదవుల ఆశావహుల నుండి దరఖాస్తులు స్వీకరించుటకు ఈ సమావేశం ఏర్పాటు చేయనైనదని, ఈ సమావేశానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంత్రి  ఆదేశానుసారం ఏర్పాటు చేయనైనదని, ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు,  తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ టీపీసీసీ పరిశీలకులు  అజ్మతుల్లా హుస్సేన్,  సంగీతం శ్రీనివాస్ హాజరైతారని, మంథని డివిజన్ లోని మండలాల నాయకులు, కార్యకర్తలు, అలాగే పాలకుర్తి లోని నాలుగు గ్రామాల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ సకాలంలో హాజరు కావాలని తిరుపతి యాదవ్ కోరారు.