02-08-2025 01:06:10 AM
బీ మహేశ్కుమార్ గౌడ్ :
తెలంగాణలో సబ్బండ వర్గాల ఆశయాలకు అనుగుణంగా ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలకు మరింత మేలు చేయాలనే సంకల్పంతో ’జనహిత’ పాదయాత్ర చేపట్టింది. రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం ఇప్పటికే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో ఇందిరమ్మ రాజ్యాన్ని అందిస్తూ ‘తెలంగాణ రైజింగ్’తో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరువయింది.
ఒకవైపు ప్రభుత్వపరంగా ప్రజాసంక్షేమ పాలన సాగిస్తున్న కాంగ్రెస్, మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎమైనా స్థానిక సమస్యలు ఎదుర్కొంటుంటే వాటిని సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో పార్టీ నేతృత్వంలో ప్రజల వద్దకు వెళ్లాలని సంకల్పించి ‘జనహిత’ పాదయాత్రకు తెలంగాణ పీసీసీ శ్రీకారం చుట్టింది. ‘ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళు’్ల అని కొలిచే కాంగ్రెస్ అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపడుతుంది.
పార్టీ అధినేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టి క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలను, ప్రజా సమస్యలను గుర్తించారు. యాత్రను స్ఫూర్తిగా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించింది. తెలుగు నాట పాదయాత్ర కాంగ్రెస్కు కొత్తకాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 2003లో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రతో ’ప్రజా మానిఫెస్టో’ రూపొందించి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్రెడ్డి, భట్టివిక్రమార్క పాదయాత్రలు నిర్వహించి ప్రజాసమస్యలతో పాటు బీఆర్ఎస్ పాలనలో ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను గుర్తించారు. వాటి పరిష్కారానికి కాంగ్రెస్ ‘అభయ హస్తం’ మానిఫెస్టో పేరిట ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నూరైనా వాటిని అమలు చేస్తోంది.
మా ప్రభుత్వం రైతు పక్షపాతి..
రైతులు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని విశ్వసించే పార్టీ కాంగ్రెస్. మా రైతు పక్షపాత ప్రభుత్వం. మా ప్రభుత్వం రైతు రుణమాఫీ, వరికి బోనస్, రైతు భరోసా, రైతు కూలీలకు ఇందిరమ్మ భరో సా వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా, పంటలకు సరైన మద్దతు ధర చెల్లించింది. సాగుకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడంతో పాటు సాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసు కున్నది.
అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంలో ముందున్నది. కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేసినా రాష్ట్రప్రభుత్వం తక్షణం స్పందించి ఆపన్నహస్తం అందించింది. మన రాష్ట్రంలో మన కు ఉద్యోగాలు లభిస్తాయనే ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువత ఆశలను బీఆర్ఎస్ సర్కార్ వమ్ము చేసింది.
ఇంటికో ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని చెప్పిన నాటి సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు రాజకీయ పదవులు ఇచ్చుకున్నారే కానీ, రాష్ట్ర యువతను పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్ర భుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే 65 వేలకు పైగా నియామకాలు పూర్తి చే యడమే కాకుండా, స్వయం ఉపాధి కోసం రాజీవ్ వికాసం ద్వారా రుణాలను అందిస్తోంది.
రాష్ట్రంలో శాస్త్రీయంగా కులగణన నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలవడంతో, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తామని ప్రకటించింది. ఇది కాంగ్రెస్ నైతిక విజయం. కులగణన గణాంకాలకు అనుగుణంగా సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలోని బడుగు బలహీన వ ర్గాలకు విద్య, ఉపాధి, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం చారిత్రాత్మక నిర్ణయం.
బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రం కేంద్రానికి పంపినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించలేదు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్థానిక ఎన్నికలను త్వరలో నిర్వహించాల్సిన దృ ష్ట్యా, బీసీలకు రాజకీయంగా అన్యాయం జరగకూడదనే సదుద్దేశంతో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తే, దాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్రానికి పంపారు. బీసీ బిల్లు, ఆర్డినెన్స్ రెండూ కేంద్ర ప్రభుత్వం వద్దనే ఉన్నాయి. ‘బీసీల నోటి కాడ ముద్ద లాగొద్దు’ అని కాంగ్రెస్ కోరుతున్నా బీజేపీ సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
బీఆర్ఎస్, బీజేపీ అన్యాయం..
బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ కృషి చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ బీసీలకు అన్యాయం చే స్తున్నాయి. ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా కేంద్రంపై ఒత్తిడి తేలేని రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు బీసీ బిల్లుకు చట్టబద్ధత సాధ్యం కాదని ప్రకటించడం.. ఆ సామాజిక వర్గాలపై వారికున్న వివక్షకు నిదర్శనం.
ఇంతదాకా వచ్చాకా తెలంగాణలోని బీసీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదనే సంకల్పంతో బీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టబద్ధత కోసం జాతీయ స్థాయిలో బీజేపీపై ఒత్తిడి తేవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఇండియా కూటమిలోని పార్టీలను కలుపుకొని, ఈనెల 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీలో నిరసనలు చేపట్టనుంది. ఈ కార్యక్రమాలకు బీసీ సంఘాలు, మేధావులు, ప్రజలు భారీగా తరలి వచ్చేలా కాంగ్రెస్ ‘జనహిత పాదయాత్ర’లో మద్దతు కూడకడుతున్నది.
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లపై బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తోంది. ‘భౌగోళికంగా రాష్ట్రం ఏర్పడినా సామాజిక తెలంగాణ రాలేదు’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవితే అన్నారంటే, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సామాజిక న్యాయం ఏమేరకు జరిగిందో అర్థం చేసుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉంటే, కేసీఆర్ సర్కార్ 23 శాతానికి తగ్గించి వారి రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసింది.
కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే బీఆర్ఎస్ మద్దతివ్వకుండా బీజేపీతో చేతులు కలిపింది. గతంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా బీసీ సంఘాలు భారీ స్థాయిలో ధర్నా నిర్వహిస్తే, దేశంలోని 15 పార్టీలు మద్దతు ఇచ్చాయి కానీ, బీజేపీ, బీఆర్ఎస్ గైర్హాజరయ్యాయి. అలాంటిది ఇప్పుడు రాష్ట్రంలో బీసీ బహిరంగ సభలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ ప్రకటించడం హాస్యాస్పదం.
బిల్లు ఆమోదం కేంద్రం వద్ద పెండింగ్లో ఉంటే ఢిల్లీలో కాకుండా రాష్ట్రంలో నిరసనలు చేపట్టడం విడ్డూరం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు మద్దతు ఇచ్చి గతంలో చేసిన తప్పిదాలకు బీఆర్ఎస్ ప్రాయశ్చితం చేసుకోవాలి.
భేషజాలు లేవు..
ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సం క్షేమ, అభివృద్ధి పనులను ప్రజల వద్దకు తీసుకెళ్లి, వాటిలో ఏమైనా లోటుపాట్లుం టే ఎలాంటి భేషజాలకు పోకుండా జనహిత పాదయాత్ర ద్వారా సమీక్షించుకుని మరింత సుపరిపాలన అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. రెండు దఫాలుగా చేపట్టనున్న ఈ పాదయాత్రకు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్తో పాటు పార్టీ రాష్ట్ర అగ్రనేతలందరూ ఉత్సాహంగా తరలివచ్చారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేపడుతున్న ‘జై బాపు, జై సంవిధాన్, జై భీమ్’ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేందుకు కూడా ‘జనహిత పాదయాత్ర’ దోహపడతుంది. ఇందులో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో శ్రమదానం నిర్వహించి పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుంది.
డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు తీసుకొచ్చిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా కాంగ్రెస్ ’జనహిత పాదయాత్ర’ను వినియోగించుకుం టుంది. ప్రజల హితం కోసం చేపట్టిన ‘జనహిత’ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది.
రచయిత- ఎమ్మెల్సీ,
టీ పీసీసీ అధ్యక్షుడు