calender_icon.png 21 June, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్తల కుటుంబాలకు అండగా కాంగ్రెస్

21-06-2025 02:14:21 AM

డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానందచార్యులు 

జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), జూన్20: కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానందచార్యులు అన్నారు. మండలంలోని సూర్యనాయక్ తండాకు చెందిన జేమ్లానాయక్, లూనావత్ సోమ్లీ మరియు వీర్యానాయక్ తండాకు చెందిన అంగన్వాడీ టీచర్ బానోతు భూబా ఇటీవల అనారోగ్యంతో మరణించారు.

విషయం తెలుసు కొని శుక్రవారం వారి కుటుంబాలను పరామర్శించి,కుటుంబ సభ్యులను ఓదార్చి,ఆర్థిక సహాయం అందించి మాట్లాడారు.ఆయా కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష,ఉపాధ్యక్షులు అనిరెడ్డి రాజేందర్ రెడ్డి,నర్సింగ శ్రీనివాస్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష,ఉపాధ్యక్షులు మోరపాక సత్యం,పెసర సతీష్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు బాష్పోలు శ్రీనివాస్, దొనకొండ వెంకన్న, బింగి కృష్ణమూర్తి, బౌరోజు ఉపేందర్, బానోతు రాజేష్, లూనావత్ వెంకన్న, కిషన్, రమేష్, లూనావత్ పవన్,బానోతు స్వామి, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.