17 April, 2026 | 2:41 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కానిస్టేబుల్ బలవన్మరణం

09-11-2025 01:21 AM
  1. ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని ఆత్మహత్యం
  2. మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లో ఘటన

ఉప్పల్, నవంబర్ 8 (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులతో మరో కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉప్పల్ మల్లికార్జున నగర్‌లో నివాసం ఉంటున్న  శ్రీకాంత్(42) 2009 సంవత్సరంలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 23 నుంచి విధులు హాజరుకాకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ అధికారులు విధులకు హాజరుకావాలని నోటీసులు సైతం జారీ చేశారు.

అయితే కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న శ్రీకాంత్ మనస్థాపానికి గురై శనివారం తాను ఉంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా ఆర్థిక ఇబ్బందులా లేదంటే వేరే ఏదైన కారణం ఉందా అనే కోణంలో పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.