17 April, 2026 | 11:49 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రాజ్యాంగాన్ని కాపాడాలి

09-04-2025 05:32 PM

దౌల్తాబాద్: రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని గాజులపల్లి, దొమ్మాట, సూరంపల్లి, ముత్యంపేట గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత రాజ్యాంగాన్ని మార్చే దిశగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చూస్తుందని అన్నారు.

భారత రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగం పరిరక్షణ కోసమే కాంగ్రెస్ పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ భాస్కర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారులాలు, నాయకులు కర్నాల శ్రీనివాసరావు, మల్లారెడ్డి, ఆది వేణుగోపాల్, స్వామి, కనకయ్య, ప్రవీణ్, సంపత్ రెడ్డి, నర్సింలు, శ్రీనివాస్, ఎల్లయ్య సాయిలు తదితరులు పాల్గొన్నారు.