03-06-2025 12:00:00 AM
- దేశంలో మొత్తం 3,961 యాక్టివ్ కేసులు
-32కు పెరిగిన మరణాల సంఖ్య
న్యూఢిల్లీ, జూన్ 2: భారత్లో కోవిడ్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం సోమవారం ఉదయానికి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,961కి పెరిగి నాలుగు వేలకు చేరువలో ఉంది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్లలో కేసులు గణనీయంగా పెరుగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
సోమవారం నాలుగు కరోనా మరణాలు చోటుచేసుకోగా.. మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 32కు పెరిగింది. ఇక కరోనా నుంచి 2,188 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్చి అయినట్టు కేంద్రం తెలిపింది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్రాల వారీగా చూస్తే కేరళలో అత్యధికంగా 1435, మహారాష్ట్రలో 506 యాక్టివ్ కేసులు ఉండగా.. ఢిల్లీలో 483, పశ్చిమ బెంగాల్లో 331, తెలంగాణలో మూడు కేసులు, ఆంధ్రప్రదేశ్లో 30 కేసులు నమోదయ్యాయి.