calender_icon.png 4 June, 2025 | 7:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

02-06-2025 01:49:09 PM

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం(Telangana Formation Day) సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ సోమవారం మాట్లాడుతూ.. దేశ పురోగతికి  లెక్కలేనంత కృషి చేసేలా తెలంగాణ ప్రసిద్ధి చెందిందని ప్రధాని కొనియాడారు. గత దశాబ్దంలో తెలంగాణ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం(NDA government) ఎన్నో చర్యలు చేపట్టిందని వివరించారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన జీవన సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. అటు కేంద్ర హోంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ శ్రేయస్సులో కొత్త శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు.

గొప్ప సంస్కృతి, కష్టపడి పనిచేసే ప్రజలతో తెలంగాణ ప్రకాశిస్తోందని తెలిపారు. ''తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. జాతీయ పురోగతికి అవిరళమైన కృషి చేసినందుకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. గత దశాబ్దంలో, రాష్ట్ర ప్రజల 'జీవన సౌలభ్యాన్ని' పెంచడానికి ఎన్డీఏ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రజలకు విజయాలు,సంపదలు కలిగేలా ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటున్నాను.'' అంటూ ప్రధాని మోదీ ఎక్స్ లో పేర్కొన్నారు. 2014లో తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన మైలురాయి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పగలు రాత్రి శ్రమించిన ప్రజల శౌర్యం, బలం, పట్టుదలను ఈ రోజు గుర్తుచేస్తుంది.