01-06-2025 01:16:08 AM
సింగపూర్, మే 31: పాకిస్థాన్తో జరిగిన సైనిక ఘర్షణలో భారత్ కొన్ని ఫైటర్ జెట్లను కోల్పోయిన మాట వాస్తవమేనని భారత త్రివిధ దళాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. సింగపూర్లో శనివారం జరిగిన షాంగ్రి డైలాగ్ సదస్సులో పాల్గొన్న జనరల్ అనిల్ చౌహాన్ బ్లూమ్ బెర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
అయితే కూలిన ఫైటర్జెట్ల సంఖ్య మాత్రం ఆయన ఎక్కడా వెల్లడించలేదు. బ్లూమ్ బర్గ్ ఇంటర్యూలో అనిల్ చౌహాన్ మాట్లాడుతూ.. యుద్ధ విమానాలు నేలకూలిన అంశం ప్రధానం కాదని.. తప్పులు సరిదిద్దుకొని దాడులను ఎలా తిప్పికొట్టామన్నది ముఖ్యమన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట జరిగిన మినీ యుద్ధంలో మా దేశానికి చెందిన ఆరు యుద్ధ విమానాలను కూల్చివేశామని పాక్ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పని సీడీఎస్ కొట్టిపారేశారు.
నాలుగు రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఏరోజూ అణుయుద్ధం వరకు వెళ్లే పరిస్థితి రాలేదని పేర్కొన్నారు. వ్యూహాత్మక తప్పిదాలు ఎక్కడ జరిగాయో తెలుసుకొని వాటిని సరిచేసి రెండ్రోజులు తర్వాత తిరిగి అమలు చేశామన్నారు. అన్ని యుద్ధ విమానాలను సుదీర్ఘ లక్ష్యాల వైపు మళ్లించామని వివరించారు.
తాము పాకిస్థాన్ భూభాగంలోకి 300 కి.మీ.ల దూరం వెళ్లి భారీ వా యు రక్షణ ఉన్న వైమానిక స్థావరాలపై కచ్చితత్వంతో దాడులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోందని, యుద్ధం అనేది భవిష్యత్తులో పాకిస్థాన్ చర్యలపై ఆధారపడి ఉంటుంద న్నారు.
పాక్కు సొంత రక్షణ వ్యవస్థ లేదు
అంతకుముందు సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (ఐఐఎస్ఎస్) వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా అనిల్ చౌహాన్ ‘ఆపరేషన్ సిందూర్’ అంశం ప్రస్తావించారు. ఆయన మాట్లాడు తూ.. పాక్కు సొంత రక్షణ వ్యవస్థ బలంగా లేకనే పొరుగున ఉన్న చైనాపై ఆధారపడిందన్నారు. చైనా సహా ఇతర దేశాల నుంచి పాక్ సేకరించిన ఆయుధాలు సరిగా పనిచేయలేదన్నారు.
ఇదంతా సొంత రక్షణ వ్యవ స్థ లోపమని చురకలంటించారు. చైనా సహా ఇతర దేశాలు సాయం చేసిన శాటిలైట్ చి త్రాలపై పాకిస్థాన్ ఎక్కువగా ఆధారపడినట్టు తెలుస్తోంది. అయితే భారత్ మాత్రం స్వదేశీ వ్యవస్థలనే ఎక్కువగా ఉపయోగించిందన్నా రు. మన సొంత శాటిలైట్ వనరులతో సమర్థవంతంగా ఉగ్రశిబిరాలపై కచ్చితత్వమైన దాడులు చేశామన్నారు. ఆధునిక రక్షణ వ్య వస్థలో సొంతంగా నిలదొక్కుకున్నామని, ఆత్మనిర్భర్ భారత్తోనే ఇది సాధ్యమవుతోందన్నారు.
స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, పెద్ద పరిశ్రమలు ఇప్పుడు రక్షణ వ్యవస్థలో పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. భా రత్ దీర్ఘకాల యుద్ధాలను ఎప్పుడూ కోరుకోదని వెల్లడించారు. మోడ్రన్ వార్ఫేర్ అనేది ఇప్పుడు సాంకేతికత, సైబర్ ఆపరేషన్స్, సమాచారాన్ని కంట్రోల్ చేసే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందన్నారు.