ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్
- ఉప రాష్ట్రపతి పదవికి సీపీ రాధాకృష్ణన్ నామినేషన్..
- నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేసిన సీపీ రాధాకృష్ణన్..
- హాజరైన ప్రధాని మోడీ, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా.
న్యూఢిల్లీ: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా(NDA Vice Presidential candidate) సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. రాధాకృష్ణన్ నామినేషన్ ను బల పరుస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తొలి సంతకం చేశారు. రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలపై ఎన్డీయే నేతలు సంతకాలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలు అందించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివారం ఎంపికైన మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan) బుధవారం నామినేషన్ దాఖలు చేయడానికి ముందు పార్లమెంటు కాంప్లెక్స్లోని ప్రముఖ వ్యక్తుల విగ్రహాలు ఉన్న ప్రేరణ స్థల్ వద్ద నివాళులర్పించారు. ఎన్నిక ఖాయం అయిన రాధాకృష్ణన్ తో పాటు కేంద్ర మంత్రులు మరియు బిజెపి నేతృత్వంలోని కూటమికి చెందిన ఇతర నాయకులు కూడా ఉన్నారు. ముందుగా ఆయన మహాత్మా గాంధీ భారీ విగ్రహం ముందు నమస్కరించి, ఆ తర్వాత ఇతర ప్రముఖ వ్యక్తులకు నివాళులర్పించారు.






