పోలీస్ సిబ్బంది సేవలు మరువం
31-03-2026 07:24 PM
- సీపీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేట క్రైం: సిద్దిపేట పోలీస్ విభాగంలో సుదీర్ఘ కాలం విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది సేవలను మరువబోమని కమిషనర్ రష్మీ పెరుమాళ్ స్పష్టం చేశారు. బెజ్జంకి పోలీస్ స్టేషన్ లో సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ సింగీతం శంకర్ రావు, సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ చాడ శ్రీనివాస్ మంగళవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా సీపీ వారికి సన్మాన పత్రం, మెమొంటో అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్ ) కుశాల్కర్, పోలీస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.




