22-06-2025 06:10:17 PM
భద్రాచలం (విజయక్రాంతి): అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం(CPM) సానుభూతిపరుడు సూర్యనారాయణ మృతదేహానికి సిపిఎం నాయకత్వం పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ సభ్యురాలు ఉస్తేలా జ్యోతి తండ్రిగారైన సూర్యనారాయణ గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆదివారం మృతి చెందారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకట రామారావు, పి సంతోష్ కుమార్ డి సీతాలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి, కనక శ్రీ పార్టీ శాఖ కార్యదర్శి సిహెచ్ ధనలక్ష్మి, జి నాగలక్ష్మి, సీతా తదితరులు మృదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.