calender_icon.png 22 June, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసముద్రం మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు నిలిపివేత

22-06-2025 06:02:48 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్(Kesamudram Agriculture Market)లో తాత్కాలికంగా మిర్చి కొనుగోలు సోమవారం నుండి నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి తెలిపారు. మిర్చి సీజన్ ముగిసిపోవడం, నాణ్యమైన మిర్చి విక్రయానికి రాకపోవడంతో, వచ్చిన మిర్చికి ఆశించిన ధర లభించడం లేదని చెప్పారు. సీజన్ ముగిసిన నేపథ్యంలో మళ్లీ సీజన్ ప్రారంభించేంతవరకు మిర్చి కొనుగోళ్ళు జరగవని, రైతులు ఈ విషయాన్ని గమనించి మార్కెట్ కు మిర్చి తేకూడదని కోరారు. మిర్చి మినహా మిగతా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ళు యధావిధిగా జరుగుతాయని తెలిపారు.