16 March, 2026 | 9:12 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

ముగ్గుల పోటీల ద్వారా సృజనాత్మకత పెంపొందుతుంది

14-01-2026 08:41 PM

చిట్యాల,(విజయక్రాంతి): మహిళలకు నిర్వహించే ముగ్గుల పోటీలు వారిలోని సృజనాత్మకతను పెంపొందించడమే కాకుండా వారిలో ఐక్యతను పెంచుతాయని మాజీ యంయల్సి చెరుపల్లి సీతారాములు అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చిట్యాలలో బుధవారం ఐద్వా, డివైయప్ఐ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఆనవాయితిగా సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. పోటీలో గెలుపొందిన మహిళలు, విద్యార్థినీ లకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మాజీ సర్పంచ్ జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ, బొబ్బలి సుధాకర్ రెడ్డి, మేడి సుగుణమ్మ, సురేష్, దినేష్, శంకరయ్య, హరీష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.