calender_icon.png 4 June, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిని విస్మరించి ఇంద్రకరణ్ రెడ్డిపై విమర్శల

02-06-2025 06:57:39 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గాన్ని 100 రోజుల్లో అభివృద్ధి చేస్తామని ప్రకటించిన నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(MLA Alleti Maheshwar Reddy) 16 నెలలు గడుస్తున్న అభివృద్ధి చేయకపోగా మంత్రి ఎమ్మెల్యేగా మారిపోయారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. శనివారం ఐక్య రెడ్డి దివాసభలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీవీ రమణ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి మాజీ మండల అధ్యక్షులు, ముడుసు సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా నాయకులు, పాకాల రామచందర్ పాకాల ఫౌండేషన్ చైర్మన్, మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్ తదితరులు మాట్లాడుతూ... నిర్మల్ లో రాజకీయ పదం కడుపు కూడా అందుకే నాయకులు చేస్తున్నారని అభివృద్ధి విషయంలో ఐక్య రెడ్డికి మహేశ్వర్ రెడ్డి కి పోలిక లేదన్నారు. 

తమ నాయకుడు అయామ్ లో జరిగిన అభివృద్ధి పనులకే మహేశ్వర్ రెడ్డి తిరిగి పనులు ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్ రెడ్డి ఇప్పటివరకు నిర్మల్ నియోజకవర్గం అభివృద్ధికి ఎన్నో నిధులు తీసుకొచ్చారు ప్రజలకు వివరించాలని వారు డిమాండ్ చేశారు. తమ నాయకుడు చేసిన అభివృద్ధిపై ప్రజల్లో బహిరంగ చర్చ పెట్టుకుందామని దానికి బిజెపి నాయకులు సిద్ధంగా ఉంటారని ప్రశ్నించారు. నిర్మల్ ఎమ్మెల్యేను 2009లో సండే ఎమ్మెల్యేగా ప్రకటించారని ఇప్పుడు నెలవారి ఎమ్మెల్యేగా ప్రజలు చర్చించుకుంటున్నారని వారు విమర్శించారు జెపి నాయకులు తీరుపై విమర్శించారు. 

మాజీ మంత్రి గత 35 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కృషిచేసిన వారిని ఎలాంటి వార్డుమెంబర్ కూడా గెలువని కాళ్ళు విమర్శించడం కరెక్ట్ కాదన్నారు. మీరు ప్రజల చేత ఎన్నుకొని 18 నెలలు కావస్తుంది కానీ ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. ప్రజలు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం చేయడం జరిగిందా ప్రజలను పట్టించుకొని మీ నాయకుడినీ పక్కన పెట్టుకొని.... పని చేసే నాయకులను విమర్శించే హక్కు లేదన్నారు. ఇక నైనా బీజేపీ నాయకులు నిరదారమైన విమర్శలు మానుకొని అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు నిర్మల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదయ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్, దేవ వినయ్, రవి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.