14-06-2025 12:00:00 AM
చేవెళ్ల, జూన్ 13: పంట మార్పిడితోనే మట్టి ఆరోగ్యంగా ఉంటుందని జయశంకర్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూచించారు. శుక్రవారంచేవేళ్ల మండలం పామెన గ్రా మంలో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాల యం ఆధ్వర్యంలో, వ్యవసాయ శాఖ సహకారంతో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవే త్తలు’ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, యూరియా వాడకాన్ని తగ్గించడం, పంట మార్పిడి ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వి. కవితా కిరణ్ చెట్ల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. అలాగే చేవెళ్ల గ్రామంలో సినియర్ శాస్త్రవేత్త డా. యమ్. ప్రమీల, యూరియా, రసాయనాల వినియోగాన్ని అవసరానికి తగ్గట్టు తగ్గించడం, పుట్టగొడుగుల సాగు గురించి వివరించారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి సిహెచ్. స్నేహలత పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. మండల వ్యవసాయ అధికారి శంకర్ లాల్, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీ బాలకోటేశ్వర్ ఆయిల్ పామ్ సాగు పద్ధతులపై సమా చారం అందించారు. ఈ కార్యక్రమాల్లో రైతులతో పాటు విద్యార్థులు కె. రాజేష్, యమ్. అపూర్వ, యస్. కౌశల్య, కె. గిరిబాబు తదితరులుపాల్గొన్నారు.