పంట మార్పిడి విధానం పాటించాలి
కలెక్టర్ ఆదర్శ్ సురభి
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి
వనపర్తి, జూన్ 10 (విజయక్రాంతి): రైతులు ఒకే పంటను నిరంతరం సాగు చేయకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని, ఎరువులను మోతాదుకు మించి వినియోగించవద్దని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం గోపాల్పేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఆయన, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులకు పంట మార్పిడి, పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ, రోడ్డు భద్రత, బాల్యవివాహాల నిర్మూలన తదితర అంశాలపై అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ ఐదు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల నిజిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉన్నత విద్య అందించాలని సూచించారు. అనంతరం గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు.






