30-05-2025 12:00:00 AM
జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్
మంచిర్యాల, మే 29 (విజయక్రాంతి) : జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో రూ. 262 కోట్లు జమ చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ వెల్లడించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా లో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసి న కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.
జిల్లాలో 345 కొనుగో లు కేంద్రాలు ప్రారంభించి 320 కేంద్రాలు ద్వారా 24,705 మంది రైతుల వద్ద నుండి 1,73,814 టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసి సంబంధిత రైతుల ఖాతాలలో రూ.262 కోట్లు జమ చేయడం జరిగిందని వెల్లడించారు. రైతుల వద్ద నుంచి పూర్తి స్థాయిలో నిబంధనల ప్రకారం వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.
నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసిన 205 కొనుగోలు కేంద్రాలను మూసి వేయడం జరిగిందని తెలిపారు. ప్రతి రోజు 4 నుంచి 8 వేల టన్ను ల ధాన్యం కాంటా చేసి 358 లారీల ద్వారా 2,500 నుంచి 5 వేల టన్నుల ధాన్యం పెద్దపల్లిలోని 110 మిల్లులకు, జిల్లాలోని 20 మిల్లులకు తరలించడం జరుగుతుందని, మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగంగా జరుగుతుందని ఆయన తెలిపారు.