30-05-2025 12:00:00 AM
కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూర్, మే 29 : ప్రజలకు నిరంతరం త్రాగునీటిని అందించేందుకు అమృత్ 2.0 పథకం క్రింద చేపట్టిన ట్యాంక్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని చెన్నూర్ పట్టణంలో నిర్మిస్తున్న అమృత్ 2.0 నీటి ట్యాంక్ నిర్మా ణ పనులను మున్సిపల్ కమీషనర్ మురళీకృష్ణతో కలిసి సందర్శించి పనులు వేగవం తం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిష న్ భగీరథ పథకం, అమృత్ 2.0 పథకాల ద్వారా ప్రతి ఇంటికి నిరంతరం త్రాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ క్రమంలో పట్టణంలో చేపట్టిన అమృత్ 2.0 నీటి ట్యాంక్ నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో గా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అలాగే కొనుగోలు కేంద్రాల్లో ఆరిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి త్వర త్వరగా మిల్లులకు తరలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండలంలోని ఆస్నాద్, గంగారం గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల తహశిల్దార్ మల్లిఖార్జున్తో కలిసి సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.
కొనుగోలు కేంద్రాలలోని ధాన్యాన్ని వెంటనే కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించాలని కోరారు. జిల్లాలో నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసిన కొనుగోలు కేంద్రాలను మూసి వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.