23 June, 2026 | 8:01 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

సీఎం సహాయనిధికి 15 కోట్ల విరాళం

06-09-2024 01:17 AM

పవర్ ఎంప్లాయీస్  జేఏసీ

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వారికి అండగా నిలిచేందుకు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్  జేఏసీ ముందుకొచ్చింది. తెలంగాణ పవర్ యుటిలిటీస్‌లోని ఇంజినీర్లు, ఉద్యోగులు, ఆర్టిసన్స్, పెన్షనర్లు తమ ఒక రోజు మూల వేతనం రూ. 15 కోట్లను సీఎం సహాయనిధికి విరాళం అందజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలను గురువారం ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రాస్,  టాన్స్‌కో, జెన్‌కో ఎండీ ముషారఫ్ అలీ, వరుణ్‌రెడ్డి సమక్షంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్‌రావు, కో కన్వీనర్ బీసీ రెడ్డి, తులసీదాస్, సదానందం, అనిల్‌కుమార్, ఎంఏ వజీర్, శ్యామ్, కుమారస్వామి, సుధాకర్‌రెడ్డి, తులసీ నాగరాణి, కరుణాకర్‌రెడ్డి, రంజీ, సత్యనారాయణ, వరప్రసాద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.