బజాజ్ హౌసింగ్ నుంచి రూ.7,000 కోట్ల ఐపీవో
ముంబై, జూన్ 11: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ.7,000 కోట్ల విలువైన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీచేసేందుకు ముసాయిదా ప్రాస్పెక్టస్ను మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి సమర్పించింది. ఐపీవోలో రూ. 4,000 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీచేయాలని, మరో రూ.3,000 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూట్లో విక్రయిస్తారని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది. ఐపీవో ప్రతిపాదనకు ఇటీవలే కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. మార్కెట్ పరిస్థితులు, రెగ్యులేటరీ అనుమతులకు లోబడి ఐపీవోను జారీచేయనున్నట్టు పేర్కొంది. రూ.50,000 కోట్లకుపైబడి ఆస్తులు కలిగిన నాన్ ఫైనాన్స్ కంపెనీల జాబితాను 2022 సెప్టెంబర్లో ఆర్బీఐ ప్రకటించింది. రెగ్యులేటర్ల మార్గదర్శకాల ప్రకారం ఆ జాబితాలో భాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 2025 సెప్టెంబర్కల్లా స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ కావాల్సి ఉంటుంది.






