28-05-2025 07:51:55 AM
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanams) భక్తుల రద్దీ కొనసాగుతుంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిలు ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan ) 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. 82,597 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 30,803 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు(TTD officials) పేర్కొన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల దేవస్థానం చర్యలు చేపట్టింది,