09-06-2025 01:34:44 AM
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా రోజురోజు కూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి బడాబాబుల వరకు ఎవరినీ సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. దేశవ్యాప్తంగా ఎంత పకడ్బందీగా చర్య లు తీసుకున్నా సైబర్ నేరగాళ్ల ఆగడాలు తగ్గడం లేదు. ఇదే సమయంలో తెలంగాణ మాత్రం సైబర్ నేరాల కట్టడిలో ముందువరుసలో ఉన్నది.
పటిష్టమైన భద్రత, ఎప్పటికప్పుడు పర్యవేక్షణతో సైబర్ నేరాలను అదుపులోకి తీసుకొస్తున్నది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. టీజీసీఎస్బీ నివేదిక ప్రకారం 2025 మొదటి ఐదు నెలల్లో తెలంగాణ సైబర్ క్రైమ్ కేసుల్లో 11% తగ్గుదల నమోదైంది. గతేడాది ఇదే కాలంలో 28% పెరుగుదల నమోదు కాగా.. ప్రస్తుతం ఇది గణనీయంగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఎల్లప్పుడూ ప్రజలకు చేరువలో ఉండటం, వేగవంతంగా నిర్ణయాలను అమలుచేయడం, అత్యాధునిక డిజిటల్ ట్రాకింగ్ సాధనాల వినియోగమే ఈ పురోగతికి దోహదం చేసిందని నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా సైబర్ నేరాల తగ్గుదలకు డేటా ఆధారిత, సమన్వయ విధానం కారణమని అధికారులు చెబుతున్నారు.
రికవరీ రేటు పెరిగింది..
తెలంగాణలో సైబర్ నేరాల కట్టడి ఆర్థిక నష్టాల తగ్గుదలకు కారణమవుతున్నది. 2024లో ఇదే కాలంతో పోలిస్తే 2025 జనవరి, ఏప్రిల్ మధ్య తెలంగాణలో సైబర్ నేరాల మూలంగా జరిగిన ఆర్థిక నష్టాలు 19శాతం తగ్గాయని టీజీసీఎస్బీ నివేదిక పేర్కొంది. గత సెప్టెంబర్ నుంచి డిసెంబర్ పోలిస్తే ఇది 30శాతం కంటే ఎక్కువ తగ్గింపును సూచిస్తుందని తెలిపింది.
ఇదేసమయంలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు సంబంధించిన ఆర్థిక నష్టాలు 12 శాతం పెరిగినప్పటికీ తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉన్నది. దేశవ్యాప్తంగా సైబర్ నేరా ల ఆర్థిక నష్టాలు పెరిగినా తెలంగాణలో తగ్గడం గమనార్హం. దీంతోపాటు మోసపోయిన బాధితుల మొత్తాల రికవరీ శాతం కూ డా గణనీయంగా పెరిగింది. 2024లో 13శాతం ఉన్న రికవరీ శాతం 2025కల్లా 16 శాతానికి పెరగడం విశేషం.
పెరిగిన ఎఫ్ఐఆర్ల సంఖ్య..
2024 ప్రారంభంలో 6,763 ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా, 2025 నాటికి వాటి సం ఖ్య 7,575కి పెరిగినట్టు నివేదికలో తేలింది. దీంతోపాటు అరెస్టులు కూడా మూడు రెట్లు పెరిగాయి. 2024ప్రారంభంలో 230గా ఉన్న అరెస్టులు, ప్రస్తుతం 626లకు పెరిగా యి. అంతర్గత ప్రక్రియలను క్రమబద్ధీకరించ డం, జిల్లా పోలీసులతో సమన్వయం మెరుగుపరచడం, రియల్-టైమ్ పర్యవేక్షణ, ట్రా కింగ్ ద్వారా వేగవంతమైన చర్యలు తీసుకోవడంతో సైబర్ నేరాలు కట్టడి చేయగలి గామని టీజీసీఎస్బీ అధికారులు చెబుతున్నారు.
రాష్ర్టవ్యాప్తంగా అవగాహన కార్యక్ర మాలు, 1930 చాట్బాట్ సైబర్ నేరాలను వేగంగా గుర్తించడానికి దారితీశాయని నివేదిక స్పష్టం చేసింది. బ్యాంకులు, సేవా సం స్థల సహకారంతో మోసాల గుర్తింపు, అనుమానాస్పద లావాదేవీలను నిరోధించడం సులభతరమైందని పేర్కొంది.